21 Feb 2012

ఖగోళ అద్భుతం


  • ఐదు గ్రహాలను వీక్షించే అవకాశం
సాధారణంగా మనం టెలిస్కోప్‌ ద్వారా తప్ప గ్రహాలను వీక్షించ లేమనే సంగతి తెలిసిందే. కాని...ఈ నెల 23 నుంచి ఖగోళ అద్భుతం ప్రారంభ మవుతోంది. రెండు వారాల పాటు కొన సాగే ఈ ఖగోళ అద్భుతం ఏమి టంటే.... బుధ, శుక్ర, అంగారక (కుజుడు), బృహస్పతి, శని గ్రహాలను నేరుగా వీక్షించవచ్చు. ఎటువంటి కళ్లద్దాలు గాని, సంబంధిత పరికరాలు గాని లేకుండానే ఈ గ్రహాలను చూడవచ్చు. అంగారక, శని గ్రహాలను ఇప్పటికే కళ్లకు సంబంధించిన పరికరాలు లేకుండా చూస్తూనే ఉన్నాం. ఇక ఈ నెల 23 నుంచి అంగాకర గ్రహాన్ని తూర్పు వైపున చూడవచ్చు. అదే సమయంలో శుక్ర గ్రహాన్ని పశ్చిమం వైపు సూర్యాస్త మయం తరువాత కూడా రాత్రి 9 గంటల వరకూ వీక్షించవచ్చు. బృహ స్పతిని శుక్రుడికి పైన రాత్రి 11 గంటల వరకూ చూడవచ్చు. ఈ వివరాలన్నీ ముంబయి లోని నెహ్రూ ప్లానిటోరియం డైరెక్టర్‌ అరవింద్‌ పరంజపే తెలిపారు. అంగార కుడు సింహ రాశిలో ఉంటాడు. సూర్యా స్తమయం తరువాత పశ్చిమాన ఈ గ్రహం కనబడుతుంది. ఎరుపు రంగులో ఉండే ఈ గ్రహాన్ని దాదాపు రాత్రంతా చూడవచ్చు. శని గ్రహాన్ని అర్థరాత్రి పూట తూర్పు వైపున చూడవచ్చు.

No comments: